అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి విజయం..
- November 21, 2016
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన కీలక స్థానిక ఎన్నికల్లో భారత సంతతి ముస్లిం మహిళ విజయభేరి మోగించింది. వలసదారుల వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత అత్యధికంగా ఉండే మేరీల్యాండ్ రాష్ట్రంలో 23 ఏళ్ల రహీలా అహ్మద్ అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. రహీలా తండ్రి భారత్కు చెందినవారు, కాగా తల్లి పాకిస్థాన్ మహిళ.మేరీల్యాండ్లోని ప్రిన్స్ జార్స్ కౌంటీ స్కూల్ బోర్డ్ ఎన్నికల్లో 15శాతం భారీ మెజారిటీతో సుదీర్ఘకాలం కొనసాగుతున్న సిస్టం అడ్మినిస్ట్రేటర్పై రహీలా విజయం సాధించింది. 2012లోనూ ఆమె ఈ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ విజయం సాధించలేదు. ఆమె కౌంటీలో 80శాతం ఆఫ్రికన్-అమెరికన్ సంతతి ఉన్నప్పటికీ ఈ అద్భుత విజయాన్ని సాధించడం గమనార్హం.ఆమెకు రిపబ్లికన్ నేషనల్ కమిటీ మాజీ చైర్మన్ మైఖేల్ స్టీల్ సైతం మద్దతు పలికారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సమయంలో హిజాబ్ ధరించి ముస్లిం మహిళ అయిన తాను గెలుపొందడం అమెరికాలో భిన్నత్వానికి తావు ఉందని చాటుతోందని, అమెరికా డ్రీమ్ ఇంకా సజీవంగానే ఉందని రహీలా అహ్మద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









