చైనా...లో ఊహించని రీతిలో పెను ప్రమాదం
- November 21, 2016
ఆసియా ఖండంలోనే అత్యాధునిక రవాణా వ్యవస్థ కలిగిన చైనాలో ఊహించని రీతిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బీజింగ్- కున్మింగ్ నగరాలను కలిపే ఎనిమిదిలేన్ల హైవేపై 56 కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్న ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. అక్కడి ప్రభుత్వ వార్తా సంస్థల కథనం ప్రకారం..ఈశాన్య చైనాలోని షాంగ్జీ ఫ్రావిన్స్ గుండా వెళ్లే బీజింగ్- కున్మింగ్ హైవేపై సోమవారం ఉదయం ఈ పెనుప్రమాదం సంభవించింది. అప్పటికే కొద్ది గంటలుగా మంచు కురుస్తుండటంతో రోడ్డుపై ప్రయాణించిన వాహనాలు పట్టుకోల్పోయి రైలింగ్ ను ఢీకొట్టాయని, ఆ సమయంలో పొగమంచు కూడా కమ్మి ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేక మొత్తం 56 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టాయని అధికారులు చెప్పారు.ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 37 మంది గాయపడ్డారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. భారీ క్రేన్ల సాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించారు. ప్రమాదం కారణంగా బీజింగ్- కున్మింగ్ హైవేను పూర్తిగా మూసేశారు. మంగళవారం నాటికి కూడా ఆ మార్గాన్ని పునరుద్ధరించలేదు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







