పిల్లలను దింపే తల్లిదండ్రులవల్లే ట్రాఫిక్ గందరగోళం

- August 31, 2015 , by Maagulf
పిల్లలను దింపే తల్లిదండ్రులవల్లే ట్రాఫిక్ గందరగోళం

విద్యార్ధులు తమ స్కూలు బస్సును తమ తరగతి గది లాగానే భావించాలని రహదారుల భద్రతా నిపుణులు శ్రీ థామస్ ఏడిల్‌మాన్ బోధించారు. కొత్త స్కూల్ టర్మ్ ప్రారంభమవనున్న సందర్భంగా పసుపు-నలుపు రంగులలోని స్కూలు బస్సులను యూ. ఏ. ఈ. లో ఈ  ఆదివారం  ఆహ్వానించారు. పాఠశాలల వద్ద ట్రాఫిక్ గందరగోళం సాధారణమే ఐనప్పటికీ, విద్యార్ధులు మరియు వాహనదారులు కూడా భద్రత కొరకై కలసి పాటుపడాలని ఆయన తెలియజేప్పారు. పాఠశాల చుట్టురా ఉండే ట్రాఫిక్ చాలా రద్దీగా - తల్లిదండ్రుల, వాహన దారుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉండడం వల్ల పిల్లల భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తూ ఉందన్నారు. గణనాల ప్రకారం, 2014లో 55 మంది 18 సం. కంటే తక్కువ వయసు పిల్లలు రోడ్డు ఆక్సిడేంట్లలో చనిపోవడం, 572 మంది గాయాలపాలవడం విచారకరమని, ఇకనైనా భద్రతా సూత్రాలను పాటించడం ద్వారా చిన్నారులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com