పిల్లలను దింపే తల్లిదండ్రులవల్లే ట్రాఫిక్ గందరగోళం
- August 31, 2015
విద్యార్ధులు తమ స్కూలు బస్సును తమ తరగతి గది లాగానే భావించాలని రహదారుల భద్రతా నిపుణులు శ్రీ థామస్ ఏడిల్మాన్ బోధించారు. కొత్త స్కూల్ టర్మ్ ప్రారంభమవనున్న సందర్భంగా పసుపు-నలుపు రంగులలోని స్కూలు బస్సులను యూ. ఏ. ఈ. లో ఈ ఆదివారం ఆహ్వానించారు. పాఠశాలల వద్ద ట్రాఫిక్ గందరగోళం సాధారణమే ఐనప్పటికీ, విద్యార్ధులు మరియు వాహనదారులు కూడా భద్రత కొరకై కలసి పాటుపడాలని ఆయన తెలియజేప్పారు. పాఠశాల చుట్టురా ఉండే ట్రాఫిక్ చాలా రద్దీగా - తల్లిదండ్రుల, వాహన దారుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉండడం వల్ల పిల్లల భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తూ ఉందన్నారు. గణనాల ప్రకారం, 2014లో 55 మంది 18 సం. కంటే తక్కువ వయసు పిల్లలు రోడ్డు ఆక్సిడేంట్లలో చనిపోవడం, 572 మంది గాయాలపాలవడం విచారకరమని, ఇకనైనా భద్రతా సూత్రాలను పాటించడం ద్వారా చిన్నారులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







