విమానాల్లో వైఫై సేవలు ...
- November 23, 2016
భారత విమానాల్లో ప్రయాణికులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెక్రెటరీ కమిటీకి టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టంతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఈ వైఫై వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. దీని వల్ల విమానాల నిర్వాహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయాలంటే భారత టెలిగ్రాఫ్ చట్టం-1885లో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి. భద్రత కారణాల వల్ల చాలా కాలంగా ఈ సేవలను భారత్ దూరంగా ఉంచింది.కాగా, కొన్ని భారత సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 'విస్తారా' సంస్థ ఇప్పటికే విమానంలో వైఫై కోసం ట్రయల్ నిర్వహించింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







