విమానాల్లో వైఫై సేవలు ...
- November 23, 2016
భారత విమానాల్లో ప్రయాణికులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెక్రెటరీ కమిటీకి టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టంతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఈ వైఫై వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. దీని వల్ల విమానాల నిర్వాహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయాలంటే భారత టెలిగ్రాఫ్ చట్టం-1885లో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి. భద్రత కారణాల వల్ల చాలా కాలంగా ఈ సేవలను భారత్ దూరంగా ఉంచింది.కాగా, కొన్ని భారత సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 'విస్తారా' సంస్థ ఇప్పటికే విమానంలో వైఫై కోసం ట్రయల్ నిర్వహించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







