విమానాల్లో వైఫై సేవలు ...
- November 23, 2016భారత విమానాల్లో ప్రయాణికులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెక్రెటరీ కమిటీకి టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టంతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఈ వైఫై వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. దీని వల్ల విమానాల నిర్వాహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయాలంటే భారత టెలిగ్రాఫ్ చట్టం-1885లో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి. భద్రత కారణాల వల్ల చాలా కాలంగా ఈ సేవలను భారత్ దూరంగా ఉంచింది.కాగా, కొన్ని భారత సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 'విస్తారా' సంస్థ ఇప్పటికే విమానంలో వైఫై కోసం ట్రయల్ నిర్వహించింది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..