విమానాల్లో వైఫై సేవలు ...
- November 23, 2016
భారత విమానాల్లో ప్రయాణికులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెక్రెటరీ కమిటీకి టెలికమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టంతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఈ వైఫై వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. దీని వల్ల విమానాల నిర్వాహణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఈ ప్రతిపాదనలను అమలు చేయాలంటే భారత టెలిగ్రాఫ్ చట్టం-1885లో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు విమానయాన సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందిస్తున్నాయి. భద్రత కారణాల వల్ల చాలా కాలంగా ఈ సేవలను భారత్ దూరంగా ఉంచింది.కాగా, కొన్ని భారత సంస్థలు విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 'విస్తారా' సంస్థ ఇప్పటికే విమానంలో వైఫై కోసం ట్రయల్ నిర్వహించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







