అబుధాబీలో వదిలివేయబడ్డ 2668 వాహనాలు స్వాధీనం
- August 31, 2015
ఈ సంవత్సరారంభం నుంచి, ముసాఫా ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాల్లోనూ, నివాస ప్రాంతాల్లోనూ వదిలివేయబడిన 3142 వాహనాలను గుర్తించి, వాటిలో 2668 వాహనాలను ద అబుధాబీ సిటీ మునిసిపాలిటీ స్వాధీనం చేసుకుంది. వదిలివేయబడ్డ వాహనాలను తరలించడానికి నోటిస్ పీరియడ్ 14 రోజుల నుండి 3 రోజులకు కుదించిన సంగతి విదితమే! అనంతరం యజమానులకు నోటీసు ఇచ్చి, సంబంధిత ఇనస్పెక్టర్ వాహనాలను తరలించే కంపెనీకి తొలగించడానికి పురమాయిస్తారు. ఈ చట్టం ట్రైలర్లు, బోట్లు మరియు అన్ని ఇతర వాహనాలకు వర్తిస్తుంది. జరిమానాగా 3000 దీనర్లు, మరల పునరావృతమైతే అందుకు రెండింతలు విధించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







