జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం : ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు

- November 25, 2016 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం : ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం నర్వాల్‌ ప్రాంతంలోని మురికివాడల వద్ద మంటలు వ్యాపించడంతో సుమారు 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలికి చేరుకున్న రక్షణ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూలోని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. బాధితుల్లో మయన్మార్‌ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు, సమీపంలోని మురికివాడల్లో నివసించే ప్రజలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలపారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com