నడిగర్ సంఘం సీనియర్ నటీనటుల్ని ఘనంగా సత్కరించారు..
- November 27, 2016
దక్షిణ భారత నటీనటుల(నడిగర్) సంఘం 63వ సర్వసభ్య సమావేశంలో భాగంగా సీనియర్ నటీనటుల్ని ఘనంగా సత్కరించారు. పరమపదించిన సినీ దిగ్గజాలను స్మరించుకుంటూ వారి పేరిట పురస్కారాలు ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ నేతృత్వంలో చెన్నై టి.నగర్లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ఊర్వశి శారదకు 'భానుమతి' పురస్కారం, వాణిశ్రీకి 'అంజలీదేవి' అవార్డును ప్రదానం చేశారు. సీనియర్ కళాకారులను సత్కరించడం గౌరవప్రదంగా ఉందని ఈ సందర్భంగా కమల్హాసన వ్యాఖ్యానించారు.కాగా, నడిగర్ సంఘం నిధులను దుర్వినియోగం చేశారంటూ మునుపటి కార్యవర్గ సభ్యులైన శరతకుమార్, రాధారవిలను శాశ్వతంగా సంఘం నుంచి తొలగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇది కోలీవుడ్లో దుమారం రేపుతోంది. శరతకుమార్ సతీమణి, నటి రాధిక దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, శరతకుమార్ను తొలగించిన విషయం పొక్కగానే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు విశాల్ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు.అంతకుముందు సమావేశం ప్రారంభంలోనూ కొందరు సభ్యులు రసాభాస సృష్టించగా, వారికి తమకు ఎటువంటి సంబంధం లేదని శరతకుమార్, రాధారవి వెంటనే వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







