నడిగర్ సంఘం సీనియర్ నటీనటుల్ని ఘనంగా సత్కరించారు..
- November 27, 2016
దక్షిణ భారత నటీనటుల(నడిగర్) సంఘం 63వ సర్వసభ్య సమావేశంలో భాగంగా సీనియర్ నటీనటుల్ని ఘనంగా సత్కరించారు. పరమపదించిన సినీ దిగ్గజాలను స్మరించుకుంటూ వారి పేరిట పురస్కారాలు ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ నేతృత్వంలో చెన్నై టి.నగర్లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ఊర్వశి శారదకు 'భానుమతి' పురస్కారం, వాణిశ్రీకి 'అంజలీదేవి' అవార్డును ప్రదానం చేశారు. సీనియర్ కళాకారులను సత్కరించడం గౌరవప్రదంగా ఉందని ఈ సందర్భంగా కమల్హాసన వ్యాఖ్యానించారు.కాగా, నడిగర్ సంఘం నిధులను దుర్వినియోగం చేశారంటూ మునుపటి కార్యవర్గ సభ్యులైన శరతకుమార్, రాధారవిలను శాశ్వతంగా సంఘం నుంచి తొలగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇది కోలీవుడ్లో దుమారం రేపుతోంది. శరతకుమార్ సతీమణి, నటి రాధిక దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, శరతకుమార్ను తొలగించిన విషయం పొక్కగానే గుర్తుతెలియని కొందరు వ్యక్తులు విశాల్ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు.అంతకుముందు సమావేశం ప్రారంభంలోనూ కొందరు సభ్యులు రసాభాస సృష్టించగా, వారికి తమకు ఎటువంటి సంబంధం లేదని శరతకుమార్, రాధారవి వెంటనే వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









