తేజస్వీ జాక్ పాట్ కొట్టింది..

- November 30, 2016 , by Maagulf
తేజస్వీ జాక్ పాట్ కొట్టింది..

తేజస్వీ జాక్ పాట్ కొట్టింది.. ఏకంగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.వెంకీ గురు మూవీ పూర్తికావడంతో మరో మూవీపై దృష్టి పెట్టాడు. 'నేను శైలజ'తో దర్శకుడిగా తన సత్తా చూపిన తిరుమల కిషోర్ వెంకీ కోసం ఒక వెరైటీ కథను సిద్ధం చేశాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్.
ఆమె చెల్లెలి పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి తేజస్వి ని ఎంపిక చేశారు.ఈ మూవీలో తేజస్వీ విక్టరీ వెంకటేష్ మరదలిగా కనిపించనుంది. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com