బ్యాండర్ అల్ ఖైతాన్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న100 మంది

- December 02, 2016 , by Maagulf
బ్యాండర్ అల్ ఖైతాన్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న100 మంది

మస్కట్ : బ్యాండర్ అల్ ఖైతాన్ ప్రాంతంలో శుభ్రపరిచే కార్యక్రమం పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ( ఎం ఓ టి ) ఒక రాయల్ డిక్రీ ద్వారా నియమిత స్థలనిర్వహణ బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించింది.ఈ ప్రచారాన్నివివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల మధ్య సహకార కృషితో దాదాపు100 మంది పాల్గొన్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.మస్కట్ ప్రాంతంలో విభిన్నసముద్ర లోతులలో బ్యాండర్ అల్ ఖైతాన్ లలో ధనిక జీవావరణలు వృద్ది చెంది పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి స్థానీయ అవిసెంనియా మరియు మడ మొక్కలతో బ్యాండర్ అల్ ఖైతాన్ ప్రాంతంలో విలక్షణ భౌగోళిక మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. పర్యావరణ మరియు  వాతావరణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ప్రతినిధులు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సహజ ఆవాసాల రక్షించడం ముఖ్యం ఎందుకు ఆ ప్రకటన తెలిపింది, మడ , అవిసెంనియా మొక్క ప్రాముఖ్యత మరియు స్థానిక జీవ పరిణామ గురించి కళాశాల విద్యార్థులకు  నేర్పించారు.పర్యాటక మంత్రిత్వ శాఖ ( ఎం ఓ టి ) ప్రచారం మేనేజర్ దావూద్ అల్ రాష్ది మాట్లాడుతూ, ఈ పథకం  ద్వారా అల్ ఖైతాన్ కాపాడుకుంటూ వైవిధ్య పర్యావరణ నిర్వహించడానికి భావిస్తోందని ఆయన అన్నారు.ఈ ప్రాంతంలో స్థానీయ అవిసెంనియా మరియు మడ మొక్కలతో సముద్ర జీవితం సంరక్షించబడుతుందని   గమనించాలని ఆయన అన్నారు. మేము నీటి అడుగున శుబ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. నీటి అడుగున ఈదే గజ ఈతగాళ్లు( డైవర్స్ ) బృందం తీరా ప్రాంత రక్షణ దళం , వ్యవసాయం మరియు ఫిషరీస్ (మరిన్ బయాలజీ సెంటర్) మరియు మాస్టర్ మెటల్ కన్స్ట్రక్షన్స్ ఎస్ ఏ ఇ వంటి ప్రైవేట్ సంస్థల మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com