వివాహిత స్త్రీలు 500 గ్రాములు..పురుషులు 100గ్రాములు బంగారం కలిగి ఉండొచ్చు
- December 03, 2016
పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు చెక్ పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్రమంగా బంగారాన్ని దాచుకున్న వారిపై కూడా కొరడా ఝళిపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను విధించే నేపథ్యంలో తాము తీసుకోనున్న చర్యల్లో భాగంగా కొన్ని విషయాలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. కొత్తగా తీసుకొస్తోన్న చట్టంలో పొందుపొరుస్తున్న అంశాల గురించి వివరణ ఇచ్చింది.దేశంలో వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాముల బంగారం కలిగివుండవచ్చునని స్పష్టం చేసింది. ఇక పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వారసత్వంగా వచ్చిన, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండబోవని స్పష్టం చేసింది. కాగా,ఆర్థికశాఖ తెలిపిన వివరాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. తమ ప్రభుత్వం నల్లకుబేరుల వద్ద ఉన్న డబ్బు, బంగారంపై ఉక్కుపాదం మోపిందని వ్యాఖ్యానించారు. రద్దైన నోట్లతో బంగారం కొని నిల్వ చేసుకునే వారి ఆగడాలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టంలో పలు మార్పులు చేసిందని పేర్కొన్నారు. బంగారాన్ని నల్లధనంతో కాకుండా సక్రమంగా కొనుకున్న వారికి ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవని తెలిపారు. వారసత్వం, స్త్రీధనంగా వచ్చిన బంగారంపై నిబంధనలు ఉండవని.. నల్లకుబేరులు లెక్కచూపని బంగారంపైనే 75 శాతం పన్ను ఉంటుందని స్పష్టత అధికారులు ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







