16న తిరుమలలో విడుదల కానున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో
- December 05, 2016
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుకలకు తిరుపతి వేదిక కానుంది. ఈ నెల 16న భారీగా నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన స్థల పరిశీలన నిమిత్తం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, బాలకృష్ణ వ్యక్తిగత పీఆర్వో సురేంద్ర నాయుడు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. వీరు ఎస్వీ యూనివర్శిటీ, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామై దానాలను పరిశీలించారు. అనంతరం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ వేడుకలకు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాల కృష్ణతో చర్చించాక 2 రోజుల్లో వేదికను అధికారికంగా ప్రకటి స్తామని తెలిపారు. ఈ నెల 16న తేదిన నిర్వహించే ఈ ఆడియో వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అతిథులుగా హాజరు కానున్నట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







