ముగ్గురు పోలీసులను చంపిన నిందితులకు కఠినశిక్షలు విధించిన కోర్టు
- December 05, 2016
మనామా: బహ్రేయినీ కోర్టు ముగ్గురికి మరణశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదుని ఆదివారం విధించింది.ఒక సమూహం జరిపిన బాంబు దాడిలో ఎమిరేట్ పొలిసు అధికారి మరియు ఇద్దరు బహ్రేయినీ పోలీసులను దారుణంగా చంపిన కేసులో వీరు ప్రధాన నిందితులని పోలీసుల మరణానికి ఆ పదిమంది కారణమైనట్లు న్యాయవర్గాలు తెలిపాయి. మార్చి 2014 లో మనామా గ్రామంలో జరిగిన ఒక బాంబును పోలీసుల మీదకు విసిరిన ఘటనలో ఒక ఎమిరేట్ అధికారి మరియు ఇరువురు బహ్రేయినీ పోలీసులు చనిపోయారు. అక్టోబర్ నెలలో ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై పునః విచారణను న్యాయస్థానం నిర్వహించి వీరిని దోషులుగా నిర్ధారించారు.ఆదివారం కోర్టు వెలువరించిన తుదితీర్పులో ముగ్గురికి మరణశిక్ష మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాక ఈ పదిమంది నిందితుల పౌరసత్వం సైతం రద్దు చేయబడింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







