త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'
- December 10, 2016
త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్'ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సకల హంగులతో కూడిన టీ-హబ్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. టీ వ్యాలెట్లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ వారంలోనే టీ-వ్యాలెట్ లోగోను ఆవిష్కరింపజేస్తామన్నారు. టీ-వ్యాలెట్ వినియోగానికి ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందని చెప్పారు. స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్సెంటర్ ద్వారా టీ-వాలెట్ సేవలు పొందవచ్చన్నారు. ఫోన్ లేకుండా కూడా టీ-వ్యాలెట్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







