కిడ్నీ మార్పిడిశస్త్రచికిత్స పూర్తిచేసిన ఎయిమ్స్ వైద్యులు
- December 10, 2016
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు శనివారం దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడిశస్త్రచికిత్స చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా, శస్త్రచికిత్స నిపుణులు వీకే బన్సల్, వి శ్రీను, నెఫ్రాలజిస్ట్ సందీప్ మహాజన్ బృందం నేతృత్వంలో ఆమెకు ఐదు గంటల పాటు శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సర్జరీ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.30గంటలకు ముగిసిందని, ఆపరేషన్ తర్వాత మంత్రిని ఐసీయూకి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మంత్రికి కిడ్నీని దానం చేసిన దాత వివరాలు గోప్యంగా ఉంచారు. 64 ఏళ్ల సుష్మ చాలాకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు.
మూత్ర పిండాల పనితీరు దెబ్బతిన్నప్పటినుంచి ఆమెకు వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. నవంబరు 16న తన అనారోగ్యం గురించి సుష్మ స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నానని, కిడ్నీ మార్పిడికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అది తెలవగానే సుష్మకు కిడ్నీ దానం చేస్తామంటూ పలువురు దాతలు ముందుకు వచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







