చంద్రబాబు యూ ఏ ఈ పర్యటన రద్దు
- December 10, 2016
ఎపికి తుపాను హెచ్చరిక కారణంగా, నోట్ల రద్దు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారని అదికార వర్గాలు తెలిపాయి.విపత్తు నిర్వహణ అదికారులు, బ్యాంకుల అదికారులతో ఆయన టెలీకాన్ఫరెస్న్ నిర్వహించారు. అదికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.చంద్రబాబు బృందం దుబాయి పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వర్ద తుపాను క్రమేపి బలపడుతోందని, అది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తుపాను కదలికల ప్రకారం మచిలీపట్నం-నెల్లూరుల మధ్య ఈనెల 12వ తేదీ మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. సోమవారం నాడు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









