దేశంలో ఐదు కోట్ల మందికి త్వరలో ఉద్యోగాలు

- December 11, 2016 , by Maagulf
దేశంలో ఐదు కోట్ల మందికి త్వరలో ఉద్యోగాలు

దేశంలో ఐదు కోట్ల మందికి త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. బషీర్‌బాగ్ న్యాయకళాశాలలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర కార్మిక మంత్రిగా ఉద్యోగాల కల్పన తన బాధ్యత అని, 2022 నాటికి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com