కుప్పకూలిన చర్చ్... 160 మంది దుర్మరణం

- December 11, 2016 , by Maagulf
కుప్పకూలిన చర్చ్... 160 మంది దుర్మరణం

నైజీరియాలోని ఆక్వా ఇబోమ్ రాష్ట్రంలోని ఉయోలో నిర్మాణంలో ఉన్న 'ది రెయినర్స్ బైబిల్ చర్చ్' అనూహ్యంగా కూలిపోవడంతో దాదాపు 160 మంది మరణించారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పాల్గొన్నారు. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గవర్నర్ ఉడోమ్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనతో తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఇదిలావుండగా, ఉయో టీచింగ్ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.క్షతగాత్రులతో ఆసుపత్రి పడకలు నిండిపోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com