కుప్పకూలిన చర్చ్... 160 మంది దుర్మరణం
- December 11, 2016
నైజీరియాలోని ఆక్వా ఇబోమ్ రాష్ట్రంలోని ఉయోలో నిర్మాణంలో ఉన్న 'ది రెయినర్స్ బైబిల్ చర్చ్' అనూహ్యంగా కూలిపోవడంతో దాదాపు 160 మంది మరణించారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అక్వా ఇబోమ్ గవర్నర్ ఉడోమ్ ఎమ్మాన్యుయేల్ కూడా పాల్గొన్నారు. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గవర్నర్ ఉడోమ్ మాట్లాడుతూ ఈ దుర్ఘటనతో తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఇదిలావుండగా, ఉయో టీచింగ్ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.క్షతగాత్రులతో ఆసుపత్రి పడకలు నిండిపోతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







