కేరళ శాసనసభ స్పీకర్ ను సన్మానించిన శలాలహ్ భారతీయ సామాజిక క్లబ్
- December 14, 2016
మస్కట్ : కేరళ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ ను శలాలహ్ భారతీయ సామాజిక క్లబ్ (ఐ ఎస్ సి) ఇటీవల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని శలాలహ్ భారతీయ సామాజిక క్లబ్ మరియు దాని మలయాళ విభాగం సంయుక్తంగా నిర్వహించారు. వివిధ సామాజిక సాంస్కృతిక సంస్థలు నుండి క్లబ్ సభ్యులు మరియు ప్రతినిధులు ఈ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరవ అతిధిని చైర్మన్ మన్ప్రీత్ సింగ్ పుష్ప గుచ్చంతో వేదికపైకి ఆహ్వానించారు మరియు బంగారు శాలువాని ఆయనపై కప్పి ఒక జ్ఞాపీకను అందించారు. సంయుక్త కార్యదర్శి వినయ్ కుమార్ అధికారికంగా కేరళ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ ను సాదరంగా స్వాగతించారు. ఆయన జీవితం మరియు సాధించిన ఘట్టాలను ప్రముఖంగా సభకు తెలిపారు. మలయాళ విభాగం కన్వీనర్ డాక్టర్ నిస్తారు మరో జ్ఞాప్తికను అందజేశారు. ఇతర ప్రతినిధులు సైతం వారి సంస్థల తరపున పలు జ్ఞాప్తికలను అతిథికి అందచేశారు. . శ్రీరామకృష్ణన్ భారత సమాజం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడంపై ఈ సందర్భంగా చైర్మన్ మరియు నిర్వహణ కమిటీ సభ్యులు ప్రశంసించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







