మిగిలిపోయిన టిక్కెట్లపై 10% డిస్కౌంట్ ప్రకటించిన రైల్వేశాఖ
- December 14, 2016
రైల్వేశాఖ మరో ప్రయోగానికి సిద్ధమైంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో మిగిలిపోయిన టికెట్లపై డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి మే 31 వరకు ఆయా టికెట్లపై పదిశాతం తగ్గింపును అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. వీటిని రైలు బయల్దేరే అరగంట ముందు కరెంట్ కౌంటర్లలో గానీ, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఆయా రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







