మిగిలిపోయిన టిక్కెట్లపై 10% డిస్కౌంట్ ప్రకటించిన రైల్వేశాఖ

- December 14, 2016 , by Maagulf
మిగిలిపోయిన టిక్కెట్లపై 10% డిస్కౌంట్ ప్రకటించిన రైల్వేశాఖ

రైల్వేశాఖ మరో ప్రయోగానికి సిద్ధమైంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో మిగిలిపోయిన టికెట్లపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి మే 31 వరకు ఆయా టికెట్లపై పదిశాతం తగ్గింపును అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. చార్ట్‌ ప్రిపేర్‌ అయిన తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. వీటిని రైలు బయల్దేరే అరగంట ముందు కరెంట్‌ కౌంటర్లలో గానీ, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 9 నుంచి ఆయా రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com