ఐసీసీ-2016 జట్టులో భారత క్రీడాకారిణి స్మృతి మందన
- December 14, 2016
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మొట్టమొదటిసారి మహిళల విభాగంలో అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఐసీసీ-2016 ఉమెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్తో పాటు, వన్డే, టీ20 విభాగాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేతల వివరాలను వెల్లడించింది.
12మంది సభ్యులు గల ఐసీసీ-2016 జట్టులో భారత క్రీడాకారిణి స్మృతి మందనకి చోటు దక్కింది. ఈ జట్టుకు వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ కెప్టెన్గా ఎంపికవ్వగా.. న్యూజిలాండ్ క్రీడాకారిణి రచెల్ ప్రీస్ట్ వికెట్కీపర్గా ఎంపికయ్యారు. అలాగే న్యూజిలాండ్కు చెందిన సుజీ బేట్స్ 2016 సంవత్సరానికి గాను వన్డే, టీ20లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు.
వన్డేల్లో ఈ అవార్డును అందుకోవడం బేట్స్ కెరీర్లో ఇది రెండోసారి. ఎనిమిది వన్డేల్లో బేట్స్ 472 పరుగులు చేసింది. 2015 సెప్టెంబరు 14 - 2016 సెప్టెంబరు 20 మధ్య కాలంలో క్రీడాకారిణుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించినట్లు ఐసీసీ నిర్వాహకులు తెలిపారు. వన్డే, టీ20 విభాగాల్లో ఒకే సంవత్సరంలో ఒక క్రీడాకారిణి రెండు అవార్డులను(సుజీ బేట్స్) కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







