కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 467 మంది కార్మికులు
- December 14, 2016
మస్కట్ : డిసెంబర్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్య కాలంలో 467 మంది కార్మికులు కార్మిక చట్టంను ఉల్లంఘించారని మానవ వనరుల మంత్రిత్వశాఖలోని లేబర్ ఇన్స్పెక్టర్లు కేసులను నమోదు చేశారు, వీరిలో 344 మంది వాణిజ్య కార్మికులు, 53 మంది వ్యవసాయ కార్మికులు మరియు 70 గృహ సంబంధిత కార్మికులు ఉన్నారు. ఈ తనిఖీల సందర్భంగా, 434 మంది కార్మికులను అరెస్టు చేశారు. వీటిలో, 281 మంది కనబడకుండా పారిపోయినవారు కాగా, 135 మంది తగ్గించబడిన కార్మికులు మరియు ౧౮ మందికి పని చేసే పత్రాలు కల్గిలేకపోవడం చేత వీరిని అదుపులో తీసుకొన్నారు. ఇదే సమయంలో అత్యధికంగా కార్మికుల దొరికిన ప్రాంతం మస్కట్ కాగా ఇక్కడ 134 మంది దొరికేరు. ఆ తర్వాత ఉత్తర బతినః లో 122 మంది పట్టుబడ్డారు. వీరందరిపై చట్టపరమైన చర్య తీసుకొనేందుకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. మరోవైపు, మంత్రిత్వ శాఖ ఇదే కాలంలో 417 మంది కార్మికులను దేశం నుంచి పంపించివేసింది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







