నేడు చక్రి ద్వితీయ వర్ధంతి..

- December 14, 2016 , by Maagulf
నేడు చక్రి ద్వితీయ వర్ధంతి..

పముఖ సంగీత దర్శకుడు గిల్లా చక్రధర్ అలియాస్ చక్రి 15 డిసెంబర్ 2014 న ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్తా టాలీవుడ్ నే కాదు యవత్ సంగీత అభిమానులకు తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది. పూరి జగ్నన్నాథ్ డైరెక్షన్ లో జగపతిబాబు హీరో గా వచ్చిన 'బాచి' సినిమాతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు దాదాపు 85 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. చక్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో 1974 జూన్ 15న జన్మించారు. అమ్మ పాటలా కమ్మదనాన్నిస్తూ హాయిని గొలిపేవిధంగా...అదే సమయంలో పాప్ మ్యూజిక్ లా పాటకి తాళం వేసేలా చెయ్యడం ఒక్క చక్రి సంగీతంతోనే సాధ్యమవుతుందేమో అనేలా సినీ జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సంగీతం సమకూర్చిన సత్యం సినిమా చక్రి పాడిన పాటకు ఉత్తమ గాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు, 'సింహా' సినిమాకు గానూ నంది అవార్డు వచ్చింది. 
చక్రి సమకూర్చిన ఎన్నో పాటల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. నీకళ్ళు పేలిపోను చూడవే అని అమ్మాయిని ఏడిపించినా...నీవే నీవే నేనంటా నీవేలేక నేనే లేనంటా అంటూ అమ్మని లాలించినా...ఏనాటికీ మనమొకటేననీ ఏచీకటీ ఇటు రాలేదని ప్రేయసికి చెప్పినా...జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది అంటూ... ఎద లయలో హత్తుకుపోయే పాటలు మనకందించి ఎంతో ప్రతిభావంతుడిగా పేరుగాంచిన చక్రి చిన్న వయస్సులో అకాల మరణం చెందడం అందరికీ విషాదాన్ని పంచింది. చక్రి మన మధ్యలేరు, కానీ మన సృతుల్లో తన పాటలా చిరంజీవిలా కలకాలం నిలిచిపోతాడు. చక్రి మన నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నా.. సినీజగత్తులో చక్రి స్వరపరచిన సినిమాల పూదోటలో పూచిన పాటల పువ్వుల పరిమళం సినీ సంగీత అభిమానులని రంజింపజేస్తూనే ఉన్నది.. నేడు చక్రి ద్వితీయ వర్ధంతి...పుట్టిన ప్రతిమనిషికి మరణంతప్పదు.. కానీ కొంతమంది మరణించీ చిరంజీవులు..చక్రి తాను స్వరపరచిన పాటల్లో బతికే ఉంటాడు.........

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com