పతంజలి ఆయుర్వేద కంపెనీకి జరిమానా ...
- December 14, 2016
యోగా గురు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీకి హరిద్వార్లోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు జరిమానా విధించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించిందన్న అభియోగాలు నిరూపణ కావడంతో రూ.11 లక్షలు జరిమానాగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇతర సంస్థలు తయారు చేసిన వస్తువులను తమ బ్రాండ్ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను పక్కదోవ పట్టించి ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ చూస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 52, 53 కింద తప్పుడు ప్రకటనలు, వినియోగదారులను పక్కదోవ పట్టించడం వంటి నేరాలతో పాటు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నేరం కింద జరిమానా విధిస్తూ..నెల రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆహార నాణ్యత ప్రమాణాల శాఖను ఆదేశించింది.
2012 ఆగస్టు 16న నిర్వహించిన ఆహార భద్రతా ప్రమాణ పరీక్షల్లోపతంజలి వస్తువులు విఫలం కావడంతో అదే ఏడాది నవంబర్లో ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఈ నెల 1న తీర్పు వెలువడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







