అమరావతి చుట్టూ నాలుగు జాతీయ రహదారులు..
- December 14, 2016
అమరావతి నిర్మాణం, అభివృద్ధిపై చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించారు. అమరావతికి అన్ని ప్రాంతాల నుంచీ సులభంగా చేరుకునేలా రహదార్లు వేయాలని సంకల్పించి ప్రభుత్వం.. కనెక్టివిటీ పెంపు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కేపిటల్ చుట్టూ ఉన్న పట్టణాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అటు సర్కులర్ ట్రెయిన్లకు లెక్కలు రూపొందించారు. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు. అక్కడి నుంచి విజయవాడ వయా తెనాలి. Map అమరావతికి కనెక్టివిటి పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమిది. సర్కులర్ ట్రైన్కు ప్రణాళిక రూపొందించారు. సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మార్గం 105 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. సర్కులర్ ట్రెయిన్ పట్టాలెక్కితే.. అమరావతికి చేరుకోవడం మరింత సులభం అవుతుందని అధికారులు చెప్తున్నారు.
నెల్లూరు, ఒంగోలు నుంచి అమరావతికి రావాలంటే.. తెనాలిలో దిగితే సరిపోతుంది. అక్కడి నుంచి సర్కులర్ ట్రైన్ ఎక్కొచ్చు. అలాగే.. సీమ జిల్లాల నుంచి గుంటూరు.. అక్కడి నుంచి సర్కులర్ రైలు. విజయవాడ నుంచి ఉద్యోగుల రాక సులభం అవుతుంది. అంతేకాదు.. రాజదానికి నిమిషాల్లో చేరుకునే వీలు కలుగుతుండడంతో.. సిబ్బంది కేవలం విజయవాడ, గుంటూరులోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోను వసతి ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలగనుంది. రాజధాని చుట్టూ నాలుగు జాతీయ రహదారులను కలుపుతూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీఆర్డీఏ పరిధిలోని పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా నిర్మాణం వుండాలని.. రెండు రోజుల్లోగా దీనిపై ప్రణాళికలు ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారాయ. రహదారులకు సంబంధించి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ 3 ఆప్షన్లను సీఎం ముందు ఉంచారు. తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నై-కోల్కతా, విజయవాడ-ముంబై, విజయవాడ-జగదల్పూర్ నేషనల్ హైవేలతో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్ప్రెస్-వేకి అనుసంధానంగా ఉండేలా ఔటర్ రింగ్ రోడ్డు వుండనుంది. రానున్న కాలంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు. ఔటర్ రోడ్పై తుది ప్రణాళిక సిద్ధమైతే ఈ నివేదికను తయారు చేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు.
రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ వుండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్షిప్లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని సీఎం అధికారులకు చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రాజధానికి దారితీసే అంతర్గత రోడ్లన్నీ మలుపులు లేకుండా వుండాలని సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ వున్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో సమాంతర అభివృద్ధి జరగాలని, ఆ దిశగా ఇప్పటినుంచే ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







