ఒమన్లో ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్స్
- December 15, 2016
వింటర్ ముగిసేనాటికి మూడు ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్స్ మవసలాత్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని సంస్థ సీనియర్ అధికారులు చెప్పారు. ఒమన్లో మూడు ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్ని ప్రారంభించాలనుకుంటున్నామనీ, వీటిల్లో రెండు అల్ ఖువైర్లో ఉంటాయని మవసలాత్ సిఇఓ అహ్మద్ బిన్ అలి అల్ బలుషి చెప్పారు. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ రీబ్రాండెడ్ వెర్షన్గా పిలవబడ్తున్న మవసలాత్, 3.6 మిలియన్ ప్రయాణీకుల్ని 2015 నవంబర్ 22 నుంచి నేటిదాకా గమ్యస్థానాలకు చేర్చించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్ షెల్టర్స్ సక్సెస్ అయితే, ఇంకా మరికొన్నిటిని నిర్మిస్తామని సంస్థ ప్రకటించింది. మవసలాత్ ప్రయాణీకులు ఈ సరికొత్త ఏసీ బస్ షెల్టర్స్ రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలంలో తమకు ఈ షెల్టర్స్ ఎంతో ఉపకరిస్తాయని వారు అంటున్నారు. 2017లో మవసలాట్ 118 కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 నిమిషాల వరకు ప్రతి 15 నిమిషాలకు ఖచ్చితంగా ఓ బస్సు ప్రయాణీకులకు అందుబాటులో ఉటోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







