'వీఐపీ 2' లో ప్రధాన పాత్ర పోషించనున్న కాజోల్
- December 16, 2016
తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కిస్తోన్న 'వీఐపీ 2' చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ.. తమ చిత్రంలో కాజోల్ నటిస్తున్నారని 'వీఐపీ 2' నిర్మాత ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 1997లో కాజోల్, అరవింద్స్వామి, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో ఓ తమిళ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'మెరుపు కలలు' అనే పేరుతో విడుదల చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత దక్షిణాదిలో ఆమె నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థను చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్ కథానాయిక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







