'వీఐపీ 2' లో ప్రధాన పాత్ర పోషించనున్న కాజోల్
- December 16, 2016
తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కిస్తోన్న 'వీఐపీ 2' చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ.. తమ చిత్రంలో కాజోల్ నటిస్తున్నారని 'వీఐపీ 2' నిర్మాత ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 1997లో కాజోల్, అరవింద్స్వామి, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో ఓ తమిళ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'మెరుపు కలలు' అనే పేరుతో విడుదల చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత దక్షిణాదిలో ఆమె నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థను చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్ కథానాయిక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









