దలై లామా, ప్రణబ్ ముఖర్జీ సమావేశమవడంపై నిరసన వ్యక్తం చేసిన చైనా
- December 16, 2016
నాతో స్నేహం కావాలంటే నా శత్రువుకు ఆతిథ్యం ఇవ్వవద్దనడం న్యాయమేనా? చైనా ఆ విదంగానే మాట్లాడుతోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశమవడంపై చైనా నిరసన వ్యక్తం చేస్తోంది. ద్వైపాక్సిక సంబంధాల్లో కలతలు రాకుండా నివారించేందుకు చైనాకుగల ప్రాథమిక ప్రయోజనాలను భారతదేశం తప్పనిసరిగా గౌరవించాలని పేర్కొంది. దలైలామా, ప్రణబ్ సమావేశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ మీడియాతో మాట్లాడుతూ ''చైనా చేసిన మర్యాదపూర్వకమైన విజ్ఞప్తిని, స్పష్టమైన అభ్యంతరాలను పక్కనబెట్టి, భారతదేశం ఇటీవల భారతదేశ రాష్ట్రపతి భవన్ను 14వ దలైలామా సందర్శించేందుకు ఏర్పాటు చేసింది.
దీంతో చైనా తీవ్రంగా అసంతృప్తికి గురైంది, దీనిని దృఢంగా వ్యతిరేకిస్తోంది '' అని పేర్కొన్నారు. ''దలైలామా రాజకీయ ప్రవాసంలో ఉన్నారు. చాలా కాలం నుంచి మతం ప్రాతిపదికగా చైనా నుంచి టిబెట్ను వేరు చేయాలని ప్రయత్నిస్తూ చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు'' అని చెప్పారు. దలై లామా ముఠా స్వభావాన్ని, చైనా వ్యతిరేకతను గుర్తించి, చైనా ప్రయోజనాలను గౌరవించాలని భారతదేశానికి తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల్లో కలతలు ఏర్పడకుండా జాగ్రత్తవహించాలన్నారు. నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఆధ్వర్యంలోని బాలల ఫౌండేషన్ ఈ నెల 10న నిర్వహించిన బాలల సదస్సులో దలై లామా పాల్గొన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







