పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై కేసు
- December 18, 2016
సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్పై ఓ న్యాయవాది సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జాతీయ గీతాన్ని అవమానించారని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుంకరి జనార్దన్గౌడ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. దేశంలోని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శించే ముందు తప్పనిసరిగా జాతీయగీతం ప్రదర్శింపచేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నిర్ణయమా అంటూ పవన్కల్యాణ్ స్పందించడాన్ని న్యాయవాది జనార్దన్గౌడ్ తప్పుబట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







