లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలు రీ-సైక్లింగ్..
- December 18, 2016
లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను వాటి తయారీదారులే కొనుగోలు చేసి రీ-సైక్లింగ్ చేసే విధంగా భారత ప్రభుత్వం త్వరలో ఓ చట్టాన్ని తీసుకురానుంది. గాలి కాలుష్యం దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ఇందుకు ప్రధాన కారణమవుతున్న లక్షల కొద్దీ ఫిట్ నెస్ లేని బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులను రీ-సైక్లింగ్ చేసే బాధ్యతలను ఆయా కంపెనీలే తీసుకునేలా చేయాలని నిర్ణయించింది.
కార్ల లైఫ్ టైమ్ పూర్తయిన తర్వాత వాటిని రీ-సైక్లింగ్ కు పంపే పాలసీలు ఇప్పటివరకూ భారత్ లో లేవు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది నవంబర్ ఏర్పడిన కాలుష్య పొగలు కారణంగా పరిస్ధితులను చక్కదిద్దేందుకు వాతావరణ మంత్రిత్వ శాఖ నడుబిగించింది.
లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను ఆయా కంపెనీలే రీ-సైకిల్ చేసేలా త్వరలో ఓ కొత్త రూల్ తీసుకురానుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కొత్త ఏడాదిలో ప్రకటించనున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో తయారీ కంపెనీలు రీ-సైక్లింగ్ సెంటర్లను నిర్మించుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల పాటు సమయం ఇవ్వనుంది. చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే ఈ పద్దతిని అమలు చేసి కాలుష్యాన్ని కొంతమేరకు అదుపు చేయడంలో సఫలీకృతమయ్యాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







