లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలు రీ-సైక్లింగ్..
- December 18, 2016
లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను వాటి తయారీదారులే కొనుగోలు చేసి రీ-సైక్లింగ్ చేసే విధంగా భారత ప్రభుత్వం త్వరలో ఓ చట్టాన్ని తీసుకురానుంది. గాలి కాలుష్యం దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ఇందుకు ప్రధాన కారణమవుతున్న లక్షల కొద్దీ ఫిట్ నెస్ లేని బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులను రీ-సైక్లింగ్ చేసే బాధ్యతలను ఆయా కంపెనీలే తీసుకునేలా చేయాలని నిర్ణయించింది.
కార్ల లైఫ్ టైమ్ పూర్తయిన తర్వాత వాటిని రీ-సైక్లింగ్ కు పంపే పాలసీలు ఇప్పటివరకూ భారత్ లో లేవు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది నవంబర్ ఏర్పడిన కాలుష్య పొగలు కారణంగా పరిస్ధితులను చక్కదిద్దేందుకు వాతావరణ మంత్రిత్వ శాఖ నడుబిగించింది.
లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను ఆయా కంపెనీలే రీ-సైకిల్ చేసేలా త్వరలో ఓ కొత్త రూల్ తీసుకురానుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కొత్త ఏడాదిలో ప్రకటించనున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో తయారీ కంపెనీలు రీ-సైక్లింగ్ సెంటర్లను నిర్మించుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల పాటు సమయం ఇవ్వనుంది. చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే ఈ పద్దతిని అమలు చేసి కాలుష్యాన్ని కొంతమేరకు అదుపు చేయడంలో సఫలీకృతమయ్యాయి.
తాజా వార్తలు
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- కరీంనగర్లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!









