రచయితపై రాజద్రోహం కేసు!
- December 18, 2016
జాతీయ గీతాన్ని అవమానిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఓ రచయితపై రాజద్రోహం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయగీతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మళయాళీ రచయిత, థియేటర్ ఆర్టిస్ట్ కమల్ సీ చవరాను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఫేస్ బుక్ లో ఆయన చేసిన పోస్టులను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు చెందిన యూత్ వింగ్ ఈ మేరకు కమల్ పై కొల్లంలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో కోజికోడ్ లో నివసిస్తున్న కమల్ ను అరెస్టు చేసి కొల్లంకు తీసుకువచ్చినట్లు చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన అంతర్జాతీయ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ కే)లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడనందుకు 12మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









