పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై నీళ్లు!
- December 19, 2016
పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రిటైర్మెంట్ నిధి సంస్థ, ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) వడ్డీరేట్లలో భారీగా కోత పెట్టింది. సోమవారం బెంగళూరులో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ ట్రస్టీ భేటీలో 2016-17ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతంగా ప్రకటించింది. గత ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుత రేటు ఏడేళ్ల కనిష్టం. దీంతో సుమారు 4 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.
ఈపీఎఫ్ వో కేంద్ర ట్రస్టీల బోర్డు సభ్యులు ప్రస్తుత వడ్డీరేట్లను ఆశించనంతగా పెంచలేదు. కనీసం యధాతథ స్థితిని కూడా కొనసాగించక పోవడంతో ఖాతాదారులు షాకయ్యారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో సంస్థ నిర్ణయం వారిలో భారీ నిరాశను మిగిల్చింది.
కాగా 2015-16 సం.రానికిగాను గత ఏడాది 8.7 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.8 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్









