మరోసారి 'నిర్భయ్' క్షిపణి విఫలం
- December 21, 2016
అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. ఈ ప్రయోగం విఫలమవడం ఇది మూడోసారి. ఒడిశాలోని బాలాసోర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని బుధవారం ప్రయోగించారు. భూ ఉపరితలంపై వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందించిన ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదిక నుంచి ప్రయోగించగా.. నిర్దేశిత మార్గంలో ఇది వెళ్లలేదని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకూ నాలుగు ప్రయోగాలు చేపట్టగా మూడు విఫలమయ్యాయి.మార్చి 2013లో మొదటిసారి నిర్భయ్ క్షిపణి ప్రయోగం చేపట్టగా అది పూర్తిగా విఫలమైంది. అక్టోబర్ 2014లో చేపట్టిన రెండో ప్రయోగం విజయవంతమైంది. అయితే నిర్దేశించిన 800 కి.మీ లక్ష్యానికి బదులు ఇది 1,010 కి.మీ ప్రయాణించింది. అక్టోబర్ 2015న చేపట్టిన మూడో ప్రయోగం, ఇవాళ చేపట్టిన నాలుగో ప్రయోగం పూర్తిగా విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







