బడా బాబుల అరెస్ట్లు..పలుచోట్ల భారీగా కొత్త నోట్లు..
- December 22, 2016
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడి ముఠాల ఆగడాలు పెద్ద ఎత్తున బయట పడుతున్నాయి. కొందరికి కోట్లలో కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. పోలీస్, ఐటీ దాడుల్లో కొత్త నోట్లు భారీగా బయటపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో 20 లక్షల 31 వేల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అటు చెన్నై ఎయిర్ పోర్టులో కోటీ 34 లక్షల రూపాయల విలువైన నోట్లను పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోల్ కతాలో బడా హవాలా దళారి పారస్ మాల్ లోధాను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆయన్ని పట్టుకున్నారు. టీడీపీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి మనీ లాండరింగ్ లో లోధా సహకరించాడని , 25 కోట్ల రూపాయల మార్పిడికి సహాయం చేశాడని అధికారులు తెలిపారు. చెన్నైలో ట్రెజరీ సెక్రటరీ నాగరాజన్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి నుంచి 31 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







