పీవీ జ్ఞానభూమిలో ప్రముఖుల ఘనంగా నివాళులర్పించారు..

- December 23, 2016 , by Maagulf
పీవీ జ్ఞానభూమిలో ప్రముఖుల  ఘనంగా నివాళులర్పించారు..

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి సందర్భంగా పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఘనంగా నివాళులర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, కాంగ్రెస్‌ నేతలు వి.హన్మంతరావు, గీతారెడ్డి, లగడపాటి రాజగోపాల్‌ తదితరులు పీవీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com