భారీగా డ్రగ్స్.. పట్టివేత..
- December 24, 2016
కొత్త సంవత్సర వేడుకల కోసం భారీ మొత్తంలో సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తున్న డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామ పరిధిలో వెంకట రాఘవ ల్యాబ్స్పై శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు. మొత్తం రూ. 3.50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే నాలుగు రియాక్టర్లను సీజ్ చేశారు. ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ దాడులు చేశారు. దాదాపు 132 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కొంతకాలంగా బొల్లారం తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వ్యాపారాన్ని కుటీర పరిశ్రమలా చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఒక రియాక్టర్ అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారుచేసిన వైనం గతంలో వెలుగు చూసింది. తాజాగా ఏకంగా ఒక ఔషధ ఫ్యాక్టరీలోనే డ్రగ్స్ తయారుచేసిన వైనం బయటపడింది. నిషేధిత డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 31 వస్తున్న నేపథ్యంలో పార్టీలలో వాడకానికి ఈ డ్రగ్స్ ఉపయోగిస్తారని సమాచారం అందింది.
ఇలాంటి డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో గ్రాము 10 వేల వరకు విలువ చేస్తాయని, అందువల్ల ఒక్క హైదరాబాద్ మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో మార్కెట్ చేయడానికి దీన్ని తయారుచేస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







