17 ఏళ్ళ పర్యావరణ ప్రేమికుడి ప్రయాణం
- December 26, 2016
17 ఏళ్ళ అహ్మద్ ఖాన్, క్లీన్ అప్ బహ్రెయిన్ అనే క్యాంప్ని చేపట్టాడు. సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ విద్యార్థి అయిన అహ్మద్ ఖాన్, పర్యావరణ ప్రేమికుడు. కాలుష్యం కారణంగా తలెత్తే అనేక సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలంటాడు. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలను భాగస్వామిగా చేసుకుని క్లీన్ అప్ బహ్రెయిన్ అనే క్యాంపెయిన్ చేపట్టాలనుకున్నాడు. అహ్మద్ ఖాన్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకోసం నాలుగు సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. చెత్త, అపరిశుభ్ర వాతావరణమే కాలుష్యానికి ప్రధాన కారణమని అహ్మద్ఖాన్ చెబుతున్నాడు. ముఖ్యంగా యువత పరిశుభ్రతపై అవగాహనతో ఉండాలనీ, వివిధ దేశాల నుంచి బహ్రెయిన్కి వచ్చేవారు సుందర ప్రాంతాల్లో పేరకుపోతున్న చెత్తతో అసహనానికి గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవడం అవసరమని అభిప్రాయపడ్డాడు. బహ్రెయిన్ వ్యాప్తంగా స్కూళ్ళలో పర్యటించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం, పరిసరాల పరిశుభ్రతపై క్లాసులు నిర్వహించాలనుకోవడం తన ముందున్న లక్ష్యాలని అహ్మద్ఖాన్ వివరించాడు. ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన బహ్రెయిన్, ప్రపంచంలోనే అతి పెద్ద సమస్య అయిన పొల్యూషన్తో సతమతమవడం తనకు బాధ కలిగిస్తోందని చెప్పాడు అహ్మద్. కట్టుదిట్టమైన చట్టాలతో, అలాగే పౌరుల్లో అవగాహనతో సింగపూర్ దేశం పొల్యూషన్ని అధిగమించగలిగిందనీ, పరిశుభ్రంగా ఉంటోందని అహ్మద్ఖాన్ వివరించాడు. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్ పొల్యూటెడ్ దేశాల్లో బహ్రెయిన్కి 10వ స్థానం దక్కిన విషయాన్ని అహ్మద్ఖాన్ గుర్తు చేశాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







