సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుతున్న వైద్య బృందం !!
- September 08, 2015
ప్రపంచంలోనే తొలిసారి మానవ తల మార్పిడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చైనా, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సాహసం చేయనున్నారు. ఈ మార్పిడి ప్రక్రియను రష్యాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తపై చేపట్టనున్నారు. ఈ కంప్యూటర్ శాస్త్రవేత్త మాస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రయోగం విజయవంతమైతే చికిత్సలేని వైద్య సమస్యల్ని తగ్గించడం ద్వారా మానవ చరిత్రలోనే భారీ మార్పులు తీసుకొస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేషన్ను హార్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఇటలీ వైద్యనిపుణుడు సెర్జియో కానవెరో, చైనా సర్జన్ రెన్ క్సియోపింగ్లు సంయుక్తంగా చేపట్టనున్నారు. కాగా, తొలి హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 1970లో అమెరికన్ న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ చేపట్టారు. ఈయన కోతి తలను మార్పిడి చేపట్టారు. ఈ ఆపరేషన్ తర్వాత కోతి చనిపోయింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ను తిరస్కరించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









