సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుతున్న వైద్య బృందం !!
- September 08, 2015
ప్రపంచంలోనే తొలిసారి మానవ తల మార్పిడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చైనా, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సాహసం చేయనున్నారు. ఈ మార్పిడి ప్రక్రియను రష్యాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తపై చేపట్టనున్నారు. ఈ కంప్యూటర్ శాస్త్రవేత్త మాస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రయోగం విజయవంతమైతే చికిత్సలేని వైద్య సమస్యల్ని తగ్గించడం ద్వారా మానవ చరిత్రలోనే భారీ మార్పులు తీసుకొస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేషన్ను హార్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఇటలీ వైద్యనిపుణుడు సెర్జియో కానవెరో, చైనా సర్జన్ రెన్ క్సియోపింగ్లు సంయుక్తంగా చేపట్టనున్నారు. కాగా, తొలి హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 1970లో అమెరికన్ న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ చేపట్టారు. ఈయన కోతి తలను మార్పిడి చేపట్టారు. ఈ ఆపరేషన్ తర్వాత కోతి చనిపోయింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ను తిరస్కరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







