సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుతున్న వైద్య బృందం !!
- September 08, 2015
ప్రపంచంలోనే తొలిసారి మానవ తల మార్పిడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చైనా, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సాహసం చేయనున్నారు. ఈ మార్పిడి ప్రక్రియను రష్యాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తపై చేపట్టనున్నారు. ఈ కంప్యూటర్ శాస్త్రవేత్త మాస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రయోగం విజయవంతమైతే చికిత్సలేని వైద్య సమస్యల్ని తగ్గించడం ద్వారా మానవ చరిత్రలోనే భారీ మార్పులు తీసుకొస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేషన్ను హార్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఇటలీ వైద్యనిపుణుడు సెర్జియో కానవెరో, చైనా సర్జన్ రెన్ క్సియోపింగ్లు సంయుక్తంగా చేపట్టనున్నారు. కాగా, తొలి హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ 1970లో అమెరికన్ న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ చేపట్టారు. ఈయన కోతి తలను మార్పిడి చేపట్టారు. ఈ ఆపరేషన్ తర్వాత కోతి చనిపోయింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్ను తిరస్కరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







