రెండో రోజు పెరిగిన పసిడి ధర
- December 28, 2016
వరుసగా రెండో రోజు పసిడి ధర పుంజుకుంది. బంగారు వర్తకుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బుధవారం నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.175 పెరిగి రూ.28,200కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి పయనించింది. కిలో వెండి రూ.350 పెరిగి రూ.39,500కి చేరుకుంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు స్వల్పంగా వూపందుకున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధర 0.35శాతం పెరిగి ఔన్సు 1,142.30డాలర్లకు(సింగపూర్) చేరుకుంది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పతనమవుతూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారు వర్తకుల వ్యాపారం తగ్గుముఖం పట్టింది.
సోమవారం నాటికి బంగారం ధర 11 నెలల కనిష్ఠానికి చేరుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







