ఉద్యోగులకు విహారయాత్ర..

- December 28, 2016 , by Maagulf
ఉద్యోగులకు  విహారయాత్ర..

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పండగల సందర్భంగా బోనస్‌లు ఇస్తుంటారు. వీటితో పాటు పలువురు యజమానులు తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు పలు రకాల ప్రోత్సాహకాలను అందజేస్తుంటారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వాటర్లూలో వున్న ఫర్నిచర్‌ తయారీ సంస్థ బెర్చ్‌ మాత్రం తమ సంస్థలో పనిచేసే మొత్తం 800 ఉద్యోగులను తీసుకొని విహారయాత్రకు వెళ్లనుంది. ఆర్థిక మాంద్యం తరువాత కంపెనీ తిరిగి పూర్వస్థితికి చేరుకున్నందుకు యాత్ర నిర్వహిస్తున్నామని సంస్థ సహ యజమాని గ్యారీ బెర్చ్‌ తెలిపారు. క్రూజ్‌ యాత్రలకు పేరొందిన కరిబియన్‌ ద్వీపాలకు యాత్రలో భాగంగా సందర్శించనున్నారు.వచ్చే ఏడాది జనవరి 8న అందరూ ఉద్యోగులు మియామికి నాలుగు విమానాల్లో చేరుకుంటారు. అనంతరం పెద్ద భవనాన్ని తలపించే క్రూజ్‌ ఓడలో ప్రయాణించి ద్వీపాలకు చేరుకుంటారు. ఇప్పటికే యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1977లో నెలకొల్పిన ఈ సంస్థకు అమెరికాలో ఫర్నిచర్‌ రంగంలో మంచి గుర్తింపువుంది.

1989లోనూ ఒకసారి అందరూ ఉద్యోగులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. అనంతరం కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. సుదీర్ఘకాలం తరువాత లాభాలను ఆర్జించింది. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆటవిడుపుగా ఈ విహారయాత్రను తలపెట్టినట్టు సంస్థ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com