ఉద్యోగులకు విహారయాత్ర..
- December 28, 2016
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పండగల సందర్భంగా బోనస్లు ఇస్తుంటారు. వీటితో పాటు పలువురు యజమానులు తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు పలు రకాల ప్రోత్సాహకాలను అందజేస్తుంటారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వాటర్లూలో వున్న ఫర్నిచర్ తయారీ సంస్థ బెర్చ్ మాత్రం తమ సంస్థలో పనిచేసే మొత్తం 800 ఉద్యోగులను తీసుకొని విహారయాత్రకు వెళ్లనుంది. ఆర్థిక మాంద్యం తరువాత కంపెనీ తిరిగి పూర్వస్థితికి చేరుకున్నందుకు యాత్ర నిర్వహిస్తున్నామని సంస్థ సహ యజమాని గ్యారీ బెర్చ్ తెలిపారు. క్రూజ్ యాత్రలకు పేరొందిన కరిబియన్ ద్వీపాలకు యాత్రలో భాగంగా సందర్శించనున్నారు.వచ్చే ఏడాది జనవరి 8న అందరూ ఉద్యోగులు మియామికి నాలుగు విమానాల్లో చేరుకుంటారు. అనంతరం పెద్ద భవనాన్ని తలపించే క్రూజ్ ఓడలో ప్రయాణించి ద్వీపాలకు చేరుకుంటారు. ఇప్పటికే యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1977లో నెలకొల్పిన ఈ సంస్థకు అమెరికాలో ఫర్నిచర్ రంగంలో మంచి గుర్తింపువుంది.
1989లోనూ ఒకసారి అందరూ ఉద్యోగులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. అనంతరం కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. సుదీర్ఘకాలం తరువాత లాభాలను ఆర్జించింది. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆటవిడుపుగా ఈ విహారయాత్రను తలపెట్టినట్టు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







