ఉద్యోగులకు విహారయాత్ర..
- December 28, 2016
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పండగల సందర్భంగా బోనస్లు ఇస్తుంటారు. వీటితో పాటు పలువురు యజమానులు తమ సంస్థల్లో పనిచేసే కార్మికులకు పలు రకాల ప్రోత్సాహకాలను అందజేస్తుంటారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వాటర్లూలో వున్న ఫర్నిచర్ తయారీ సంస్థ బెర్చ్ మాత్రం తమ సంస్థలో పనిచేసే మొత్తం 800 ఉద్యోగులను తీసుకొని విహారయాత్రకు వెళ్లనుంది. ఆర్థిక మాంద్యం తరువాత కంపెనీ తిరిగి పూర్వస్థితికి చేరుకున్నందుకు యాత్ర నిర్వహిస్తున్నామని సంస్థ సహ యజమాని గ్యారీ బెర్చ్ తెలిపారు. క్రూజ్ యాత్రలకు పేరొందిన కరిబియన్ ద్వీపాలకు యాత్రలో భాగంగా సందర్శించనున్నారు.వచ్చే ఏడాది జనవరి 8న అందరూ ఉద్యోగులు మియామికి నాలుగు విమానాల్లో చేరుకుంటారు. అనంతరం పెద్ద భవనాన్ని తలపించే క్రూజ్ ఓడలో ప్రయాణించి ద్వీపాలకు చేరుకుంటారు. ఇప్పటికే యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1977లో నెలకొల్పిన ఈ సంస్థకు అమెరికాలో ఫర్నిచర్ రంగంలో మంచి గుర్తింపువుంది.
1989లోనూ ఒకసారి అందరూ ఉద్యోగులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. అనంతరం కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. సుదీర్ఘకాలం తరువాత లాభాలను ఆర్జించింది. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆటవిడుపుగా ఈ విహారయాత్రను తలపెట్టినట్టు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







