రెండో రోజు పెరిగిన పసిడి ధర

- December 28, 2016 , by Maagulf
రెండో రోజు పెరిగిన పసిడి ధర

వరుసగా రెండో రోజు పసిడి ధర పుంజుకుంది. బంగారు వర్తకుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో బుధవారం నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.175 పెరిగి రూ.28,200కి చేరుకుంది. పసిడి బాటలోనే వెండి పయనించింది. కిలో వెండి రూ.350 పెరిగి రూ.39,500కి చేరుకుంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు స్వల్పంగా వూపందుకున్నాయి.

అంతర్జాతీయంగా బంగారం ధర 0.35శాతం పెరిగి ఔన్సు 1,142.30డాలర్లకు(సింగపూర్‌) చేరుకుంది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పతనమవుతూ వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారు వర్తకుల వ్యాపారం తగ్గుముఖం పట్టింది.
సోమవారం నాటికి బంగారం ధర 11 నెలల కనిష్ఠానికి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com