షార్జాలో భారతీయుని హత్య కేసులో అనుమానితుడు అరెస్ట్..
- December 29, 2016
- శరీరం పై పలు కత్తిపోట్లు... దుకాణం లోపల మృతదేహం లభ్యం
షార్జా: స్థానిక మైసూన్ ప్రాంతంలో ఒక దుకాణం లోపల శరీరం పై పలు కత్తిగాట్లతో చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహం షార్జ పోలీసుల చేత కనుగొనబడింది.ఈ మరణంకు కారణం మరొక వ్యక్తి ప్రమేయం ఉందని నమ్మకంతో పోలీసులు ఒక అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ దారుణ హత్యకు గురైన వ్యక్తి 52 ఏళ్ల భారతీయుడిగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి యొక్క శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయని మంగళవారం ఉదయం తన స్వంత కిరాణా దుకాణం లోపల అతని మృతదేహం కనుగొనబడింది. అనుమానితుడితో ఒక ఆర్ధిక వివాదం కారణంగా 52 ఏళ్ల భారతీయ వ్యక్తి హతమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన విషయంపై వారి మధ్య జరిగిన ఒక చర్చ హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దీంతో నిందితుడు బాధితుడుపై కత్తితోదాడి చేసి విచక్షణారహితంగా కత్తితి పొడిచి చేయడంతో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు.కాగా మంగళవారం ఉదయం హతుడ్ని కనుగన్నతర్వాత షార్జా పోలీసులు భారతీయుడిని హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడానికి 12 గంటల కంటే తక్కువ సమయంలోఅనుమానితుదీని అదుపులోనికి తీసుకొన్నారు, పోలీసు పెట్రోల్, పారామెడిక్స్ మరియు సిఐడి నుండి ఒక జట్టు సంఘటన స్థలానికి తరలించబడింది మరియు వారు కత్తిపోట్లకు గురైన బాధితుడి జీవితం రక్షించడానికి వారు ఎంతో ప్రయత్నించారు.హంతకుడిని సత్వరమే అరెస్ట్ చేసి కేవలం గంటల వ్యవధిలోనే పోలీసు బృందం చేసిన ప్రయత్నాలపై షార్జా పోలీస్ కార్యకలాపాలు డైరెక్టర్ కల్నల్ మహ్మద్ రషీద్ బయటి ప్రశంసల జల్లు కురిపించారు ఈ కేసుని షార్జా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించేవారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







