టర్కీ లో 40 మంది ఐసిస్ ఉగ్రవాదుల నిర్బంధం

- December 30, 2016 , by Maagulf
టర్కీ లో 40 మంది ఐసిస్ ఉగ్రవాదుల నిర్బంధం

తనఖీల్లో భాగంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్టు టర్కీ పోలీసు అధికారులు తెలిపారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఆర్మీ వాహనాలు, హెలికాప్టర్లు తరలిరాగా స్పెషల్ ఫోర్స్ పోలీసులు అదనా నగరంలో తనిఖీలు నిర్వహించారు. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులకు ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీళ్లు ఐఎస్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 2015 నుంచి టర్కీలో ఐఎస్ ఉగ్రవాదులు, కుర్దిష్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com