బాణాసంచా పేలుడు లో 10 మంది మృతి..
- December 30, 2016
నెల్లూరు జిల్లా కేంద్రం శివారులోని పొర్లుకట్ల సమీపంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 10 మంది సజీవ దహనమయ్యారు.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని 108 వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పలువురి శరీరం పూర్తిగా కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సహాయచర్యలు చేపట్టేందుకు ఆటంకంగా మారింది.
పొర్లుకట్ట.. బాణాసంచా తయారీకి అడ్డా
నెల్లూరు నగర శివారులోని పొర్లుకట్ల బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందింది. జిల్లావ్యాప్తంగా ఇక్కడి నుంచే బాణాసంచా ఎగుమతి చేస్తుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరమంతా ఇక్కడ బాణాసంచా తయారుచేస్తుంటారు. ఇక్కడి బాణాసంచా తయారీ కేంద్రాల్లో చాలావాటికి కనీస అనుమతులు లేనట్లు సమాచారం. పోలీసులు అప్పుడప్పుడూ దాడులు చేయడం తప్ప.. కేసులు పెట్టిన దాఖలాలు కూడా లేనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







