ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- December 21, 2025
యూఏఈ: ఈ సంవత్సరం క్రిస్మస్కు స్వదేశానికి వెళ్లడం కొంతమంది యూఏఈ నివాసితులకు ఖరీదైన వ్యవహారంగా మారింది. పండుగ రద్దీ సమయంలో ఇండియాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు తమ స్వస్థలాలకు బదులుగా సమీపంలోని ఇతర దేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.
తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో దుబాయ్లో నివసిస్తున్న కోల్కతాకు చెందిన ప్రవాసి పాల్ జె మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఖర్చులు భాగా పెరిగాయని అన్నారు. కోల్కతాకు రౌండ్-ట్రిప్ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి దాదాపు Dh3,400గా ఉంది. నలుగురికీ టిక్కెట్లకే దాదాపు Dh14,000 ఖర్చవుతుంది. ఆపై స్థానికంగా ప్రయాణం, షాపింగ్ ఇలా అన్ని కలిపితే, ఒక వారం పర్యటనకు సులభంగా Dh18,000 దాటిపోతుందని అతను చెప్పాడు.
దీంతో దానికి బదులుగా, తాము కైరోను పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు టిక్కెట్ల దరలు దాదాపు Dh1,200 ఉన్నాయని, దాంతో తమ ఫ్యామిలీ వెకేషన్ తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని పాల్ వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్లో అధిక ఛార్జీలు తన ప్రణాళికలను పూర్తిగా మార్చేసిందని అన్నారు. బెంగళూరుకు రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు దాదాపు Dh1,800గా ఉంది. దీంతోపాటు స్వదేశంలో అదనపు ఖర్చులతో కలిపిపే ఖరీదైనదిగా మారుతుందని అన్నారు. ఇస్తాంబుల్ లాంటి గమ్యస్థానాలు ఈ సమయంలో డబ్బుకు మంచి విలువను అందిస్తాయని తాము గ్రహించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







