ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- December 21, 2025
యూఏఈ: ఈ సంవత్సరం క్రిస్మస్కు స్వదేశానికి వెళ్లడం కొంతమంది యూఏఈ నివాసితులకు ఖరీదైన వ్యవహారంగా మారింది. పండుగ రద్దీ సమయంలో ఇండియాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు తమ స్వస్థలాలకు బదులుగా సమీపంలోని ఇతర దేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.
తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో దుబాయ్లో నివసిస్తున్న కోల్కతాకు చెందిన ప్రవాసి పాల్ జె మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఖర్చులు భాగా పెరిగాయని అన్నారు. కోల్కతాకు రౌండ్-ట్రిప్ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి దాదాపు Dh3,400గా ఉంది. నలుగురికీ టిక్కెట్లకే దాదాపు Dh14,000 ఖర్చవుతుంది. ఆపై స్థానికంగా ప్రయాణం, షాపింగ్ ఇలా అన్ని కలిపితే, ఒక వారం పర్యటనకు సులభంగా Dh18,000 దాటిపోతుందని అతను చెప్పాడు.
దీంతో దానికి బదులుగా, తాము కైరోను పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు టిక్కెట్ల దరలు దాదాపు Dh1,200 ఉన్నాయని, దాంతో తమ ఫ్యామిలీ వెకేషన్ తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని పాల్ వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్లో అధిక ఛార్జీలు తన ప్రణాళికలను పూర్తిగా మార్చేసిందని అన్నారు. బెంగళూరుకు రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు దాదాపు Dh1,800గా ఉంది. దీంతోపాటు స్వదేశంలో అదనపు ఖర్చులతో కలిపిపే ఖరీదైనదిగా మారుతుందని అన్నారు. ఇస్తాంబుల్ లాంటి గమ్యస్థానాలు ఈ సమయంలో డబ్బుకు మంచి విలువను అందిస్తాయని తాము గ్రహించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









