ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- December 21, 2025
యూఏఈ: ఈ సంవత్సరం క్రిస్మస్కు స్వదేశానికి వెళ్లడం కొంతమంది యూఏఈ నివాసితులకు ఖరీదైన వ్యవహారంగా మారింది. పండుగ రద్దీ సమయంలో ఇండియాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు తమ స్వస్థలాలకు బదులుగా సమీపంలోని ఇతర దేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.
తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో దుబాయ్లో నివసిస్తున్న కోల్కతాకు చెందిన ప్రవాసి పాల్ జె మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఖర్చులు భాగా పెరిగాయని అన్నారు. కోల్కతాకు రౌండ్-ట్రిప్ టిక్కెట్ ధర ఒక్కొక్కరికి దాదాపు Dh3,400గా ఉంది. నలుగురికీ టిక్కెట్లకే దాదాపు Dh14,000 ఖర్చవుతుంది. ఆపై స్థానికంగా ప్రయాణం, షాపింగ్ ఇలా అన్ని కలిపితే, ఒక వారం పర్యటనకు సులభంగా Dh18,000 దాటిపోతుందని అతను చెప్పాడు.
దీంతో దానికి బదులుగా, తాము కైరోను పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు టిక్కెట్ల దరలు దాదాపు Dh1,200 ఉన్నాయని, దాంతో తమ ఫ్యామిలీ వెకేషన్ తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని పాల్ వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్లో అధిక ఛార్జీలు తన ప్రణాళికలను పూర్తిగా మార్చేసిందని అన్నారు. బెంగళూరుకు రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు దాదాపు Dh1,800గా ఉంది. దీంతోపాటు స్వదేశంలో అదనపు ఖర్చులతో కలిపిపే ఖరీదైనదిగా మారుతుందని అన్నారు. ఇస్తాంబుల్ లాంటి గమ్యస్థానాలు ఈ సమయంలో డబ్బుకు మంచి విలువను అందిస్తాయని తాము గ్రహించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







