బంగారం అక్రమ రవాణా...పట్టుకున్న కస్టమ్స్ అధికారులు..
- December 30, 2016
లో దుస్తుల్లో పెట్టుకొని బంగారం అక్రమ రవాణా చేస్తుండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న సంఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగుచూసింది. 1.25 కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాతనగరంలోని రెయిన్ బజార్ కుచెందిన అమేర్, ఫహద్, ఫసియుద్దీన్ లు స్నేహితులు. మూడునెలల క్రితం ఫహద్, ఫసీయుద్దీన్లు సౌదీకి వెళ్లారు.అమేర్ హైదరాబాద్ లో ఉండేవాడు. అమేర్ కూడా సౌదీకి వెళ్లి మరో ఇద్దరితో కలిసి వస్తూ అమేర్ బంగారం బిస్కెట్లు తీసుకువస్తూ అధికారులకు దొరికాడు. శుక్రవారం జెడ్డా విమానం దిగి ఎయిర్పోర్టు వెలుపలి కి వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేయగా అమేర్ వద్ద ఒక కిలో 435 గ్రాముల బంగారం దొరికింది.
తన లోదుస్తు ల్లో బంగారం దాచుకొని తెస్తుండగా సోదాల్లో లభించిందని అధికారులు చెప్పారు. బంగారం స్వాధీనం చేసుకొని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. జెడ్డా దేశం నుంచి వస్తున్న విమానం లో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు సమాచా రం అందడంతో కస్టమ్స్ అధికారులు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఎయిర్పోర్టులో మాటువేసి నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







