రవితేజ రీమేక్ తో ఎంట్రీ..
- December 31, 2016
సినీ ప్రముఖుల వారసులు మాత్రమేకాదు.. రాజకీయనాయకుల వారసులు కూడా వెండితెరపై మెరిసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది రాజకీయనాయకుల వారసులు సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ. ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే తొలి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రవితేజ, రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తమిళ్ లో ఘనవిజయం సాధించిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రీమేక్ స్పెషలిస్ట్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







