బాధ్యతలు స్వీకరించిన వాయుసేన, సైన్యం కొత్త అధిపతులు..
- December 31, 2016
భారతీయ వాయుసేన, సైనిక దళాలకు కొత్త అధిపతులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జనరల్ బిపిన్ రావత్ భారత సైనిక దళాల అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం జనరల్ బిపిన్ రావత్ను నియమించింది. వాయుసేన ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా భారతీయ వాయుసేన అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా స్థానంలో ధనోవాను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటన ఈ నెల 16న వెలువడింది. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అధిపతిగా నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







