ఎటిఎం మోసం కేసులో 6 గురుని అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు
- December 31, 2016
జెడ్డా: ఎటిఎం మోసం కేసులో ఆరుగురిని విచారణ భాగంగా అరెస్టు చేసినట్లు మక్కా పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులకు ఎటిఎంలలో బ్యాంకు నిధుల దుర్వినియోగం కాబడుతున్నట్లు అనేక పిర్యాదులు అందినట్లు పోలీసు ప్రతినిధి కల్నల్ ఎటి అల్ క్కురాశి శుక్రవారం చెప్పారు. బ్యాంకులను మోసం చేస్తున్న వారిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు నిఘా అధికం చేశారు.జెడ్డాలో ఎటిఎం యంత్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలను రహస్యంగా అమర్చి వినియోగదారుల కార్డు పిన్ తదితర వివరాలు తెలుసుకొని మోసానికి దొంగిలించడానికి బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న కొందరు నిందితులను దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఎటిఎంల వద్ద ఈ తరహా నేరాలు పెరిగినట్లు నివేదికలు అందుకున్నపోలీసులు తరువాత, అటువంటి మోసపూరిత కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక భద్రతా ప్రణాళికను ఏర్పాటుచేసినట్లు పోలీసు విభాగం ప్రతినిధి వివరించారు.సిరియన్ జాతీయతకు చెందిన ఆరుగురు నిందితులను అదుపులో తీసుకొన్నారు. వారిని క్షుణంగా శోధించిన తరువాత పోలీసులు వారి వద్ద మీటర్ రీడర్లు మరియు ఇతర పరికరాలు కనుగొన్నారు. వ్యాపార వీసాలతో కింగ్డమ్ లోనికి ప్రవేశించిన 6 అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







