పేలుడు పదార్ధాల నిల్వ కేసులో నిర్దోషిగా యువకులు

- December 31, 2016 , by Maagulf
పేలుడు పదార్ధాల నిల్వ కేసులో నిర్దోషిగా యువకులు

 మనామా: పేలుడు పదార్ధాల తయారీ అలాగే తుపాకీ మ్యాగజైన్స్ రూపొందిస్తున్నారని నేరారోపణ కలిగిన ఇరువురు బహ్రేయినీ యువకులను ఉన్నత నేర న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. 19 , 24 ఏళ్ళ వయస్సు గల ఇరువురిని పోలీసులు పట్టుకొన్నారు. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో భారీ పేలుడు పదార్ధాల నిల్వ మరియు అల్లర్లలో వినియోగించే ఇతర పరికరాలను తయారుచేస్తున్నట్లు  పోలీసుల దాడిలో కనుగొన్నారు.పోలీసులు కోర్టుకి సమర్పించిన స్వాధీన అంశాల జాబితా జాబితాలో ఇంట్లో తయారు చేసిన బాంబును, అగ్నిని రాజేసే పేలుడు పదార్ధాలు , విద్యుత్ తీగలు, పెయింట్ సీసాలు, 100 ఖాళీ సీసాలు, ఎక్సటింగిశేర్స్ , రంపాలు , కారు బ్యాటరీ, ఒక సిలికాన్ తుపాకీ ,18 మొబైల్ ఫోన్లు, చేతి తొడుగులు, సిమ్ కార్డులను మరియు నలుపు టి-షర్టులు  చేర్చబడ్డాయి.ఈ పేలుడు పదార్ధాల కేసులో యువత ప్రమేయం ఉందని వారు విచారణ జరిపారు, పోలీసు దర్యాప్తు లో స్థాపించబడినట్లు కోర్టులో న్యాయమూర్తుల ఉన్నట్లు సాక్ష్యం లేని కారణంగా ఈ కేసుని కొట్టివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com